News

తెలంగాణ భవన్‌లో 8న మహిళా దినోత్సవం


రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం భారీఎత్తున నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ చెప్పారు. క్రీడలు, సాంస్కృతి క, సాహితీ, ఉపన్యాసం, రాజకీయం, రచన రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించిన పది మంది మహిళలకు స్త్రీ శక్తి పురస్కారాలు ప్రదానంచేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది పార్టీ తరపున వేడుకలు నిర్వహిస్తామని, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం తరుపున స్త్రీ శక్తి పురస్కారాలు ప్రదానం చేయాలని సీఎంను కోరనున్నట్లు తెలిపారు.. సమావేశంలో రంగారెడ్డి, మెదక్ జెడ్పీ చైర్‌పర్సన్లు పీ సునీతా మహేందర్‌రెడ్డి, రాజమణి పాల్గొన్నారు.